యాప్నగరం

తూర్పు గోదావరిలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు..

సెల్‌ఫోన్ షాపు యజమాని, అతని దుకాణంలో పనిచేసే వ్యక్తితో కలసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్‌ని ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 6 Sep 2020, 6:52 pm
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని కాజలూరు మండలం జగన్నాథగిరి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరప మండలం పెద్దాపురప్పాడుకి బిరుదా లక్ష్మణ్(38), దేవిశెట్టి మల్లి(22) బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


బైక్‌ని ఢీకొట్టిన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్, మల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు లక్ష్మణ్ రామచంద్రాపురం, ద్రాక్షారామంలో రామ్‌లక్ష్మణ్ సెల్‌ఫోన్ షాపు యజమానిగా తెలుస్తోంది. అతని దుకాణంలో పనిచేసే మల్లితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: మందు తాగి భర్తని పొడిచేసిన లేడీ డాక్టర్.. హైదరాబాద్‌లో ఘోరం

Also Read: పాత సామాన్లు కొంటాం.! అంటూ వచ్చి.. గన్నవరంలో షాకింగ్ చోరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.