యాప్నగరం

ఆరేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకుల అఘాయిత్యం.. విశాఖలో దారుణ ఘటన

చాక్లెట్లు కొనిస్తానని బాలికను నమ్మించిన ఇద్దరు యువకులు ఆమెను పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు. బాలిక ఏడవడంతో స్థానిక మహిళలు అక్కడికి చేరుకుని ఆ ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Samayam Telugu 16 Feb 2020, 9:48 am
ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన విశాఖ జిల్లాలో వెలుగుచూసింది. పరవాడ సమీపంలోని ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధి తిక్కవానిపాలెంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
Samayam Telugu girl rape


Also Read: అర్థరాత్రి ఒంటరి యువతిపై కీచక పర్వం.. ఏలూరులో మరో దిశ కేసు

గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి స్థానికంగా ఓ పాఠశాలలో ఎల్‌కేజి చదువుతోంది. శనివారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక సాయంత్రం వేళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను మాటల్లోకి దించారు. చాక్లెట్లు కొనిస్తామని మాయమాటలు చెప్పి పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. బాలిక పెద్దగా ఏడవడంతో స్థానిక మహిళలు కొందరు అక్కడికి చేరుకుని ఆ కామాంధులను పట్టుకుని చితకబాదారు.

Also Read: ‘పెళ్లన్నాడు.. సహజీవనం చేసి వదిలేశాడు’.. ప్రియుడి ఎదుట యువతి ధర్నా

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. నిందితులిద్దరూ వివాహితులని, మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వైజాగ్ సౌత్‌ ఏసీపీ రామాంజనేయులరెడ్డి పరవాడ స్టేషన్‌కు చేరుకుని నిందితులను విచారించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: టీచర్‌‌పై పోలీసుల గ్యాంగ్ ‌రేప్.. తీవ్రంగా కొట్టి ఒకరి తర్వాత మరొకరు.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.