యాప్నగరం

యువకుడిని కత్తులతో పొడిచిన దుండగులు.. విశాఖలో దారుణం

మాటు వేసిన ఇద్దరు దుండగులు యువకుడిని కత్తులతో పొడిచి పరారయ్యారు. బాధితుడు బుల్లెట్ మెకానిక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కంచరపాలెంలో జరిగింది.

Samayam Telugu 10 Oct 2020, 10:18 am
యువకుడిపై కత్తులతో దాడి ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. బుల్లెట్ మెకానిక్‌గా పనిచేస్తున్న యువకుడిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచేశారు. ఈ ఘటన కంచరపాలెం పరిధిలోని ధర్మనగర్‌‌లో జరిగింది. బాధితుడిని బుల్లెట్ మెకానిక్ మోసెస్ అలియాస్ రవి కుమార్‌‌గా గుర్తించారు. మెకానిక్‌పై కత్తులతో దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Samayam Telugu కత్తులతో దాడిలో తీవ్రంగా గాయపడిన రవికుమార్
murder attempt


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన రవికుమార్‌ని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలిచారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ క్రిష్ణారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. యువకుడిపై కత్తులతో దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: సూర్యాపేటలో దారుణం.. నోట్లో గుడ్డలు కుక్కి బాలికపై అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.