యాప్నగరం

అమాయక చిన్నారులపై అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో దారుణం

అభం శుభం తెలియని బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు కామాంధులు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కుప్పం ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నాయి.

Samayam Telugu 5 Aug 2020, 1:53 pm
చిత్తూరులో జిల్లాలో ఇద్దరు బాలికలపై అత్యాచార ఘటనలు కలకలం రేపాయి. మదనపల్లె, కుప్పం ప్రాంతాల్లో కామాంధులు చిన్నారులపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మదనపల్లె గ్రామీణ మండలం ఓ గ్రామానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమార్తె(6) సోమవారం ఇంటి వద్దే ఒంటరిగా ఆడుకుంటోంది. అదే అదనుగా భావించిన ఓ బాలుడు(17) ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు దుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు విచారించగా జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మదనపల్లె రూరల్‌ సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu Image


Also Read: స్నేహితులు కాదు కీచకులు.. నమ్మి వచ్చిన బాలికపై ఆరుగురు కలిసి రేప్

కుప్పం గ్రామీణ మండలంలోని అనిమిగానిపల్లె గ్రామానికి చెందిన మైనర్‌ బాలికపై అదే గ్రామానికి చెందిన సోమశేఖర్(21) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధితులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పం అర్బన్‌ సీఐ శ్రీధర్‌, ఎస్ఐ నరేంద్ర పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి వివాహిత గ్యాంగ్ రేప్.. 2 నెలల తర్వాత వెలుగులోకి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.