యాప్నగరం

అబ్బాయితో మాట్లాడారని ఇద్దరు బాలికల హత్య.. పాక్‌లో దారుణం

ముగ్గురు బాలికలు ఓ అబ్బాయితో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో అందులోని ఇద్దరు బాలికలను కుటుంబసభ్యులే దారుణంగా చంపేశారు.

Samayam Telugu 19 May 2020, 10:57 am
పాకిస్థాన్‌ దేశంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. ఓ అబ్బాయితో మాట్లాడారన్న అక్కసుతో చెందిన ఇద్దరు బాలికలను కుటుంబ సభ్యులే కాల్చి చంపారు. పాకిస్తాన్‌లోని ఉత్తర వాయువ్య గిరిజన ప్రాంతంలో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. 16, 18 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికలు మే 14న హత్యకు గురయ్యారు. అంతకు కొద్దిరోజుల ముందు వీరిద్దరు ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయింది. వారి ప్రవర్తనపై ఆగ్రహం చెందిన కుటుంబసభ్యులే ఇద్దరు బాలికను హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరు బాలిక తండ్రి కాగా, మరొకరు బాలిక సోదరుడిగా గుర్తించారు.
Samayam Telugu Image


Also Read: రూ. 150 కోసం స్నేహితుడి హత్య.. లాక్ డౌన్ వేళ ముంబయిలో దారుణం

అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న మూడో బాలిక, యువకుడికి ప్రాణహాని ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వారిద్దరికి భద్రత కల్పించారు. ఈ పరువు హత్యలపై స్థానికంగా అనేక సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్‌ ఏటా వెయ్యి మందికి పైగా పరువు హత్యలకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Also Read: బాలికపై అక్క భర్త లైంగిక దాడి.. అబార్షన్ వికటించి బాధితురాలు మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.