యాప్నగరం

కొంపముంచిన సడెన్ బ్రేక్.. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మూడు లారీలు ఒకదాని వెనక మరొకటి ఢీకొన్నాయి. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 21 Nov 2020, 2:00 pm
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సడెన్ బ్రేక్ వేయడం వెనక వస్తున్న వారిని ప్రమాదంలోకి నెట్టింది. ఒకదాని వెనక మరో లారీ ఢీకొన్నాయి. వరుసగా రెండు లారీలు, ఒక కారు ఢీకొని ధ్వంసమయ్యాయి. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా ఒకలారీ వెనక మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా మారింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ క్యాబిన్లలో ఇరుక్కుపోయిన డ్రైవర్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. లారీల వెనక ఢీకొన్న కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పంటకాల్వలో తలను ముంచి చంపేసిన భర్త.. వీడిన ప్రకాశం టీచర్ మర్డర్ మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.