యాప్నగరం

ప్రియురాలి తండ్రికి మెసేజ్ చేసిన యువకుడు.. బావిలో శవాలై తేలిన అక్కాచెల్లెళ్లు

తమ ప్రేమ వ్యవహారం గురించి కుటుంబసభ్యులకు తెలిసి పోవడంతో ఆందోళన చెందిన అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి పారిపోయి ఊరి చివరన ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 12 Aug 2020, 1:09 pm
తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందన్న ఆందోళనతో అక్కాచెల్లుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సియోని జిల్లాలోని కొంద్రా గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు(16 ఏళ్లు, 18 ఏళ్లు). వీరు అదే ప్రాంతానికి చెందిన యువకులతో వేర్వేరుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. ఇద్దరూ బాయ్‌ఫ్రెండ్స్‌తో తరుచూ ఛాటింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆ యువకుల్లో ఒకరు ‘మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను’ అంటూ ఆమె తండ్రికి మెసేజ్‌ పంపాడు.
Samayam Telugu Image


Also Read: 9మందిని చంపిన సింహాద్రి.. ఆట కట్టించిన పోలీసుల పంట పండింది

ఈ క్రమంలోనే మరో అమ్మాయి ప్రేమ వ్యవహారం కూడా బయటపడింది. దీంతో తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందని ఆందోళనకు గురైన అక్కాచెల్లెళ్లు ఇంట్లో నుంచి పారిపోయి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మెసేజ్ పంపిన యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: విశాఖ: ఒకే వ్యక్తితో తల్లీకూతుళ్ల అఫైర్.. రూ.30లక్షలతో పరారైన ప్రియుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.