యాప్నగరం

వర్షంలో పానీపూరి.. ప్రాణాలు తీసింది.. హైదరాబాద్‌లో విషాదం

పానీపూరి కోసం వరదలను సైతం లెక్కచేయకుండా వెళ్లిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. వాగులో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డారు.

Samayam Telugu 15 Oct 2020, 3:32 pm
హైదరాబాద్ నగరాన్ని వరద ముంచెత్తించి. కనీవినీ ఎరగని రీతిలో బీభత్సం సృష్టించింది. నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. డ్రైన్లు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కార్లు, వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఇంజపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
Samayam Telugu ప్రాణాలు కోల్పోయిన టీనేజర్లు ప్రణయ్, ప్రదీప్
death


టీనేజ్ యువకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా గుర్తించారు. ప్రణయ్, సందీప్ ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం పానీపూరి తినేందుకు తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు వెళుతుండగా వాగులో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Also Read: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.