యాప్నగరం

ఆంటీతో కలసి యువతి ఆత్మహత్య.. పెళ్లి కుదరడంతో విడిచి ఉండలేక..

రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన జ్యోతి బిడ్డతో కలసి ఉంటోంది. ఆమెకి అదే గ్రామానికి చెందిన ప్రియతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.

Samayam Telugu 17 May 2020, 9:50 pm
ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్ తాలూకా ఎలయపాళయంకి చెందిన జ్యోతి(31), ప్రియ(23) ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జ్యోతి ఇంట్లో సీలింగ్‌కి ఇద్దరూ ఉరి బిగించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జ్యోతి ఇంటికి వచ్చిన ఆమె తమ్ముడు ఎంతపిలిచినా తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి రెండు తలుపుల మధ్యలో ఉన్న సందులో నుంచి చూడడంతో ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టానికి పంపారు.

Also Read: కస్టమర్‌లా కిల్లర్‌ని పంపించిన భర్త.. నమ్మేసిన భార్య కారెక్కించుకుని..

జోతికి వివాహమై మూడేళ్ల కూతురు ఉంది. కుటుంబ కలహాల కారణంగా రెండేళ్ల కిందట భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన ప్రియతో సాన్నిహిత్యం కుదిరింది. ప్రియకి పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పెళ్లి జరిగిపోతే ఇద్దరూ విడిపోవాల్సి వస్తుందని భావించి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో అసలు నిజాలు తెలియాల్సి ఉంది.

Read Also: ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశాడని దారుణం.. తుపాకీతో కాల్చి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.