యాప్నగరం

ఒకే ఇంట్లో ఐదురుగు మిస్సింగ్.. నెల్లూరులో కలకలం

ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు కనిపించకుండా పోయారు. ఆస్పత్రికని ఆటో ఎక్కిన మహిళల ఆచూకీ మధ్యాహ్నం నుంచి దొరకలేదు.

Samayam Telugu 17 Nov 2020, 11:08 am
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కనిపించకుండా పోవడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఆస్పత్రికి వెళ్లి వస్తామని పిల్లలతో సహా బయలుదేరిన తోడికోడళ్లు కనిపించకుండా పోయారు. జిల్లాలోని వెంకటగిరి మండలం లో ఈ ఘటన జరిగింది. జీకే పల్లి నుంచి వెంకటగిరి ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళలు, చిన్నారులు మధ్యాహ్నం నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి వారి ఆచూకీ దొరకలేదు. కనిపించకుండా పోయిన వారి కోసం పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రికి బయలుదేరిన మహిళలు ఎక్కడికి వెళ్లి ఉంటారు? పిల్లలతో సహా వెళ్లిపోవాల్సిన కారణమేంటి? అనే దిశగా ఆరా తీస్తున్నారు.
Samayam Telugu అదృశ్యమైంది వీరే..
missing


Also Read:
పంట కాల్వలో శవమై తేలిన టీచర్.. ఆ రాత్రి ఏం జరిగింది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.