యాప్నగరం

గుంటూరులో మానవమృగం.. రెండేళ్ల చిన్నారిపై దారుణం

మానవమృగాలు జనావాసాల్లోనే తిరుగుతున్నాయి. నిలువెల్లా కామంతో దారుణాలకు తెగబడుతున్నాయి. పాలు తాగే వయసున్న చిన్నారులపై కూడా అమానుషంగా..

Samayam Telugu 12 Aug 2020, 8:02 pm
ఉరిశిక్షలు విధించినా కామాంధుల్లో భయం కలగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యాలకు తెగబడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై సైతం కామకోరికలతో రెచ్చిపోతున్నారు. అలాంటి దారుణ ఘటన తాజాగా ఏపీలో చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం అత్యాచారానికి తెగబడింది. ఈ అత్యంత దారుణ ఘటన గుంటూరు నగరంలోని నెహ్రూనగర్ జీరోలైన్‌‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape


ఆడుకుంటున్న చిన్నారిపై కన్నేసిన బేరీల రాము అనే వృద్ధుడు నీచానికి పాల్పడ్డాడు. మానవ మృగంగా మారి ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తక్షణం స్పందించిన పోలీసులు దుర్మార్గుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అత్యాచార ఘటన తెలుసుకున్న అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Also Read: కన్నతండ్రి కామవాంఛలు తీర్చలేక.! తండ్రిని కూతుళ్లు చంపేసిన కేసులో షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.