యాప్నగరం

వేములవాడలో కేటుగాళ్లు.. పోలీసులమంటూ పైసా వసూల్.. చివరికి..

పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులను టార్గెట్ చేసుకున్నారు కేటుగాళ్లు. యాత్రికుల వద్దకు వచ్చి పోలీసులమని చెప్పి బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు. తీరా విషయం అసలు ఖాకీల చెవిలో పడడంతో..

Samayam Telugu 1 Nov 2020, 5:42 pm
ఇద్దరు కేటుగాళ్లు పోలీసులు అవతారమెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ నిద్రిస్తున్న వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. పోలీసులమని బెదిరించి వసూళ్లకు పాల్పడడంతో అనుమానం వచ్చిన భక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో కేటుగాళ్ల ఆటకట్టించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిన్న రాత్రి నిద్రిస్తున్న యాత్రికుల నుంచి ఇద్దరు యువకులు డబ్బులు వసూలు చేశారు. పోలీసులమంటూ బెదిరించి భక్తుల వద్ద డబ్బులు లాక్కున్నారు.
Samayam Telugu వసూళ్లకు పాల్పడిన నిందితులు
fake cops


అనుమానం వచ్చిన కొందరు యాత్రికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సిరిసిల్లకు చెందిన అలువాల ప్రశాంత్ (24) కొండా రాజశేఖర్(23)ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్టు పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. పట్టణ ప్రజలు, యాత్రికులు ఇలాంటి కేటుగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. మఫ్టీలో ఎవరైనా కొత్త వారు పోలీసులమంటూ బెదిరించినా.. వారిపై మీకు అనుమానం కలిగినా వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.

Also Read: యువకుడితో అర్ధరాత్రి భార్య.. భర్త ఇంటికి రావడంతో.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.