యాప్నగరం

కళ్లలో కారం కొట్టి.. కత్తులతో పొడిచి.. హైదరాబాద్‌లో దారుణం

కిరాణా షాపు నడుపుతున్న అంజన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా పొడిచేశారు. చేతి మణికట్టుని కోసేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న అంజన్‌ని ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 12 Aug 2020, 6:22 pm
కిరాణా షాపు యజమాని కళ్లలో కారంకొట్టి కత్తులతో పొడిచేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హయత్‌నగర్‌కి చెందిన అంజన్ రెడ్డి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. గుర్తుతెలియని దుండగులు అంజన్‌పై హత్యాయత్నం చేశారు. దుకాణంలో చొరబడిన దుండగులు అంజన్ కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచేశారు. చేతులు, మెడపై కత్తిగాట్లున్నాయి. గొంతుకోసి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన బాధితుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder attempt


ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఊరి నుంచి ఇంటికి వచ్చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో దుకాణం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దుకాణానికి తాళం వేయకపోవడంతో షట్టర్ తీసి రక్తపు మడుగులో పడి ఉన్న అంజన్‌ని చూసి షాక్‌కి గురయ్యారు. క్షతగాత్రుడిని తక్షణం సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనిపై ఎవరు? ఎందుకు హత్యాయత్నం చేశారో తెలియాల్సి ఉంది.

Also Read: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సికింద్రాబాద్‌లో విషాద ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.