యాప్నగరం

ఆళ్లగడ్డ: వాకింగ్‌కు వెళ్లిన యువకుడిపై కత్తులతో దాడి... రెండ్రోజుల్లో పెళ్లి

మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన యువకుడిపై కొందరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం తెల్లవారుజామున జరిగింది.

Samayam Telugu 6 Jan 2021, 7:34 am
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం తెల్లవారుజామున యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పట్టణంలోని ఓ ప్రాంతంలో నివసించే యువకుడికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. మరో రెండ్రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున తండ్రితో కలిసి వాకింగ్‌కు వెళ్లిన యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
Samayam Telugu Image


ఈ ఘటనతో షాకైన తండ్రి గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చీకటిగా ఉండటంతో దుండగులను తాను గుర్తుపట్టలేకపోయానని బాధితుడి తండ్రి పోలీసులకు తెలిపాడు. అయితే ఈ దాడికి పాతకక్షలా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.