యాప్నగరం

సంచిలో దుప్పట్లో చుట్టిన మహిళ శవం.. హైదరాబాద్‌లో పారేసిన వ్యక్తులు

Banjara Hills: ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ కళింగరావు స్పందించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమకు 100 ద్వారా కాల్ వచ్చిందని చెప్పారు. ఒక సంచిలో మృతదేహం చుట్టి పడేశారని ఎవరో చెప్పారని వివరించారు.

Samayam Telugu 30 Aug 2020, 4:22 pm
హైదరాబాద్ నగరంలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో ఓ గోనె సంచిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. అందులోని శవం ఓ దుప్పటిలో చుట్టి ఉంది. గుర్తు తెలియని దుండగులు దుప్పటిలో చుట్టిన మృతదేహాన్ని గోనెసంచిలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వృద్ధురాలు ఎవరనే దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కరోనాతో చనిపోతే ఇలా వదిలిపోయారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలం చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Samayam Telugu మృతదేహాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది
dead body in bag in banjara hills


ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ కళింగరావు స్పందించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమకు 100 ద్వారా కాల్ వచ్చిందని చెప్పారు. ఒక సంచిలో మృతదేహం చుట్టి పడేశారని ఎవరో చెప్పారని వివరించారు. వెంటనే తమ బృందాలు స్పాట్‌కి చేరుకొని పరిశీలించాయని, ఆ వ్యక్తి వయసు సుమారు 72 సంవత్సరాలు ఉంటుందని వివరించారు. చనిపోయిన వృద్ధురాలు సమీపంలోని ఓ మసీదు వద్ద భిక్షాటన చేస్తుందని చెప్పారు.

వృద్ధురాలి ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని, కాబట్టి కరోనా వచ్చి చనిపోతే ఇక్కడ తీసుకొచ్చి పడేసిఉంటారని అనుమానిస్తున్నట్లు వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతంలో ఎవరు గమనించకపోవడం వల్లే ఇక్కడ మృత దేహాన్ని పడేసి వెళ్లి ఉండొచ్చని వివరించారు. ఐపీసీ సెక్షన్ 174 ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.