యాప్నగరం

సూర్యాపేటలో దారుణం. 108 డాక్టర్‌పై కత్తితో దాడి

108 డాక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి. నిద్రిస్తున్న సమయంలో కత్తులతో దాడి. కేసు నమోదు చేసిన పోలీసులు. వివాహేతర సంబంధమే కారణమన్న కోణంలో దర్యాప్తు.

Samayam Telugu 6 Apr 2020, 10:36 am
తెలంగాణ సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 108 డాక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ నిద్రిస్తున్న 108 డాక్టర్ నిరంజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కత్తులతో ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో నిరంజన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా మారిండంతో వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే డాక్టర్‌పై దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Samayam Telugu knife


దాడి జరిగిన ప్రాంతంలో క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడింది ఎవరన్న విషయాల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిరంజన్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.