యాప్నగరం

గర్భస్రావమై ప్రియురాలి మృతి.. పెళ్లి పీటలపై వరుడికి షాక్

Meerut: పెళ్లికి కొన్ని క్షణాల ముందే ఓ యువకుడు అరెస్టయ్యాడు. అతడి కారణంగా మోససోయిన ఓ యువతి రక్తస్రావమై మరణించడమే అందుక్కారణం. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Samayam Telugu 9 Dec 2020, 9:39 pm
పెళ్లికి కొన్ని క్షణాల ముందే 24 ఏళ్ల ఓ యువకుడు రేప్ కేసులో అరెస్టయ్యాడు. అతడి కారణంగా గర్భం దాల్చిన ఓ యువతి పరిస్థితి విషమించి మృతి చెందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వధువు కుటుంబం షాక్‌కు గురైంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో మంగళవారం (డిసెంబర్ 8) ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
UP man arrested on his wedding day as lover dies of abortion pills he gave (Representational Image)


బులంద్‌షహర్ పట్టణానికి చెందిన రాహుల్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమ పేరుతో 20 ఏళ్ల యువతిని లోబర్చుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. కొన్ని నెలలుగా ఇలా చేస్తుండటంతో ఆ యువతి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భవతి.

ఇదిలా ఉండగా.. యువకుడి తల్లితండ్రులు అతడికి మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. మంగళవారం ఉదయం పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి కుమారుడిని ఊరేగింపుగా మండపానికి తీసుకెళ్లారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

పెళ్లికి ముందు రోజు బాధిత యువతి గర్భ విచ్ఛిత్తి కోసం అబార్షన్ పిల్స్ తీసుకుంది. ఆ ట్యాబ్లెట్లను ఆమెకు రాహులే ఇచ్చాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో కుటుంబసభ్యులు బులంద్‌షహర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మీరట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది.

పెళ్లి పేరుతో తమ కుమార్తెను లొంగదీసుకొని ఆమె మరణానికి కారణమయ్యాడని రాహుల్‌పై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరో యువతితో పెళ్లి నిశ్చయం చేసుకున్న తర్వాత కూడా తమ కుమార్తెకు మాయమాటలు చెప్పాడని ఆరోపించారు.

‘పెళ్లికి ముందు రోజు రాహులే మా అమ్మాయికి అబార్షన్ పిల్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. హాస్పిటల్‌లో చేర్పించిన తర్వాత ఆమే ఈ విషయాన్ని మాకు చెప్పింది. ఆమెకు రక్తస్రావం అయ్యేంత వరకు తను రాహుల్ చేతిలో మోసపోయి గర్భం దాల్చిన విషయం కూడా మాకు తెలియదు’ అని పోలీసులతో బాధితురాలి మేనమామ చెప్పారు.

తమ కుమార్తెను మోసం చేసి ఆమె మరణానికి కారణమైన రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్లు బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పీ సంతోశ్ కుమార్ సింగ్ తెలిపారు. అసలు విషయం తెలిసిన తర్వాత వధువు కుటుంబం తమ కుమార్తెకు పెద్ద గండం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: భారత్‌ను చూసి నేర్చుకోవాలి: బిల్ గేట్స్‌

Must Read: కొత్తగా పెళ్లి, కరోనా భయంతో దగ్గరకు రాని భర్త.. భార్య షాకింగ్ ట్విస్ట్!

Also Read: తల్లికి కరోనా వైరస్.. అమ్మాయిపై నలుగురి అఘాయిత్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.