యాప్నగరం

అత్త ముక్కును కొరికేసిన అల్లుడు

అదనపు కట్నం కోసం జరిగిన వివాదంలో ఓ వ్యక్తి తన అత్త ముక్కును కొరికేశాడు. అది వారించాల్సిన అతడి తండ్రి ఆమె చెవిని కత్తితో కోసేయడం గమనార్హం. యూపీలో ఈ దారుణం జరిగింది

Samayam Telugu 27 Aug 2019, 12:31 am
కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్న విషయం తెలుసుకొని వచ్చిన దంపతులకు అల్లుడి నుంచి చేదు అనుభవం ఎదురైంది. అల్లుడు తన అత్త ముక్కును కొరికేయగా.. అతడి తండ్రి కత్తితో ఆమె చెవిని కోసేశాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో ఆదివారం (ఆగస్టు 25) ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu representational Image


రెహమాన్‌, గుల్షన్ అనే దంపతులు ఏడాది కిందట తమ కుమార్తె చాంద్‌ బీని మొహమ్మద్‌ అష్వక్‌ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కట్నం కింద రూ.10 లక్షలు ముట్టజెప్పారు. ఇటీవల చాంద్ బీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి అత్తింటి వారు చాంద్ బీని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.

మరో 5 లక్షల రూపాయలు అదనంగా కావాలని అష్వక్ తన భార్యను వేధించసాగాడు. ఆమె ఎదురు ప్రశ్నించడంతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న చాంద్ బీ తల్లిదండ్రులు ఆదివారం తమ కుమార్తె అత్తింటి వారితో మాట్లాడేందుకు బరేలీలోని వారి నివాసాని వచ్చారు.

Must Read: ఫేస్‌బుక్‌తో మధ్య వయసు మహిళలకు ట్రాప్.. సైబర్ కేటుగాడి దారుణం

వారి మధ్య మాటల యుద్ధం పెరగడంతో అష్వక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన అత్తపై దాడి చేసి ముక్కును కొరికేశాడు. అతడి తండ్రి ఇజార్‌ కూడా గుల్షన్‌పై దాడి చేసి కత్తితో ఆమె చెవిని కోసేశాడు.

ఘటన అనంతరం తండ్రి, కొడుకులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. స్పృహ కోల్పోయిన గుల్షన్‌ను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.