యాప్నగరం

భార్యను కిరాతకంగా చంపి తలతో 1.5కి.మీ. నడుచుకుంటూ..

శనివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడిన రావత్ ఆమెను పదునైన కత్తితో పొడిచి చంపేశాడు. అయినా ఆవేశం చల్లారక ఆమె తలను వేరుచేసి దాన్ని చేతబట్టుకుని నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు.

Samayam Telugu 1 Feb 2020, 11:06 pm
కోపం మనిషిని పశువును చేస్తుందని అంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘటనను చూస్తూ అది నిజమే అనిపిస్తుంది. కుటుంబ తగాదాలతో భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె తలతో 1.5కిలోమీటరు నడుచుకుంటూ వెళ్లి ఉన్మాదిలా ప్రవర్తించాడు.
Samayam Telugu up


Also Read: మైనర్‌తో యువకుడి ఓరల్‌ సెక్స్.. వీడియో తీసిన మరో మైనర్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జహంగిరాబాద్‌ పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలోని బహదుర్‌పురా గ్రామానికి చెందిన అకిలేశ్‌ రావత్‌ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన రజని అనే యువతితో వివాహమైంది. వీరికి ఓ పాప పుట్టి కొద్దిరోజులకే అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం రావత్, రజని మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.

Also Read: ఇదేం అరాచకం.. మహిళ వేధింపులు తట్టుకోలేక హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన రావత్ భార్యను ఇంట్లో నుంచి బయటకు లాగి పదునైన కత్తితో మెడ కోసేశాడు. అనంతరం శరీరం నుంచి తలను వేరుచేసి కిలోమీటరున్నర దూరం పిచ్చిపట్టినవాడిలా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ వెళ్లాడు. అతడి చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని కదిర్‌పూర్ అనే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. రావత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అన్న భార్యపై కన్ను.. దానికి తోడు ఆస్తి తగాదాలు.. పశ్చిమ గోదావరిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.