యాప్నగరం

టీచర్‌‌పై పోలీసుల గ్యాంగ్ ‌రేప్.. తీవ్రంగా కొట్టి ఒకరి తర్వాత మరొకరు.. దారుణం

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే కామాంధులుగా మారిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంటికెళ్తున్న ఓ లేడీ టీచర్‌ని బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెపై వ్యభిచారిణి అని ముద్రవేసి దారుణంగా రేప్ చేశారు. అనంతరం డబ్బులు చేతిలో పెట్టి ఇంటికెళ్లమని చెప్పిన అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.

Samayam Telugu 15 Feb 2020, 6:42 pm
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే కామాంధులుగా మారిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంటికెళ్తున్న ఓ లేడీ టీచర్‌ని బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెపై వ్యభిచారిణి అని ముద్రవేసి దారుణంగా రేప్ చేశారు. అనంతరం డబ్బులు చేతిలో పెట్టి ఇంటికెళ్లమని చెప్పిన అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.
Samayam Telugu up policemen kidnap teacher gang rape her in gorakhpur
టీచర్‌‌పై పోలీసుల గ్యాంగ్ ‌రేప్.. తీవ్రంగా కొట్టి ఒకరి తర్వాత మరొకరు.. దారుణం


రోడ్డుపై వెళ్తున్న టీచర్‌ని అడ్డగించి..

ఓ లేడీ టీచర్(24)ని పోలీసులు గ్యాంగ్ రేప్‌ చేసిన ఘటన గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్‌‌లో చోటుచేసుకుంది. సోదరి ఇంటికెళ్లి వస్తున్న యువతిని ఇద్దరు పోలీసులు అడ్డగించారు. వ్యభిచారం నుంచే కదా వస్తున్నావంటూ బెదిరించారు. తనకేమీ తెలియదని.. సోదరి ఇంటి నుంచి వస్తున్నానని చెప్పినా వినకుండా బలవంతంగా బైక్‌పై ఎక్కించారు. ఆమె తల్లి వెనక వస్తుందని చెప్పినా పట్టించుకోకుండా లాక్కెళ్లారు.


Also Read: యువతి దారుణ హత్య.. వన్‌సైడ్ లవర్‌తో ఏడాది తర్వాత వెలుగులోకి..

దారుణంగా రేప్..

రైల్వేస్టేషన్ సమీపంలోని ఒక గదికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనను విడిచిపెట్టాలని.. ఇంటికి వెళ్తానని వేడుకున్నా కనికరించకుండా కామాంధులు ఆమెపై దారుణంగా రేప్ చేశారు. సామూహిక అత్యాచారం చేశారు. ఆమె విడిపొంచుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమె ఒంటిపై తీవ్రగాయాలయ్యాయి. అయినా వదలని మృగాళ్లు ఆమెపై పడి పశువాంఛ తీర్చుకున్నారు.


Read Also: అన్న అత్యాచారం చేయలేదు.. చెల్లెలి సూసైడ్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు

వ్యభిచారిణిగా ముద్ర..

అనంతరం ఆమె చేతిలో రూ.600 పెట్టి ఇంటి వెళ్లాలని చెప్పారు. డబ్బులు ఇచ్చి నిజంగానే ఆమె వ్యభిచారిణి అన్నట్లుగా ముద్రవేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికెళ్లిన బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తీవ్రగాయాలతో ఇంటికి చేరిన కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. అనంతరం పోలీస్ స్టేషన్‌లో పోలీసులపై ఫిర్యాదు చేశారు.


Also Read: డిగ్రీ విద్యార్థినులను బాత్రూంకి తీసుకెళ్లి.. లోదుస్తులు విప్పించి మరీ.. ఆ పరీక్ష..

పోలీసుల అనుమానాలు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న యువతి నుంచి వివరాలు సేకరించారు. అయితే ఆమె చెప్పిన విషయాలపై అనుమానాలు ఉన్నాయని పోలీసులు చెప్పడం గమనార్హం. బాధితురాలిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి మరీ వివరాలు సేకరించారు. అయితే ఎస్పీ మాట్లాడుతూ విచారణ జరుగుతోందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.