యాప్నగరం

రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు మృతి

యూపీలో సంచలనం సృష్టించిన బులంద్‌షహర్‌ సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సలీం బవారియా కడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. 2016లో సలీం బవారియా తన స్నేహితులతో కలిసి ఓ కుటుంబాన్ని అడ్డగంగి ఓ మహిళ, ఆమె టీనేజీ కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Samayam Telugu 17 Dec 2019, 2:07 pm
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 2016లో సంచలనం సృష్టించిన బులంద్‌షహర్‌ సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సలీం బవారియా మృతి చెందాడు. కిడ్నీ వ్యాధితో బాధ పడతున్న సలీం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 2016లో సలీం బవారియా తన స్నేహితులతో కలిసి ఢిల్లీ- కాన్పూర్‌ జాతీయ రహదారి గుండా కారులో వెళ్తున్న ఓ కుటుంబంపై దాడి చేసి.. మగవాళ్లందరినీ చెట్టుకు కట్టేసి 35 ఏళ్ల మహిళ, 13 ఏళ్ల ఆమె కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Samayam Telugu bulandshahar


Also Read: నల్లగా ఉందని వెక్కిరింపు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సలీం బవారియాతో పాటుగా అతడి స్నేహితులు జుబేర్‌, సాజిద్‌లపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం వీరంతా బులంద్‌షహర్‌ జైల్లో ఉన్నారు.

అయితే కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సలీం ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో అతడిని ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా డయాలసిస్‌ నిర్వహించారు. అయితే సలీం ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారడంతో అతడిని తిరిగి బులంద్‌షహర్‌కు తీసుకురాగా అక్కడ మృతి చెందాడు. సామూహిక అత్యాచార కేసులో మిగిలిన నిందితులిద్దరూ బులంద్‌షహర్‌ జైల్లోనే ఉన్నారు.

Also Read: శ్రీశైలం వెళ్లిన హైదరాబాద్ కుటుంబం అదృశ్యం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.