యాప్నగరం

కటింగ్ నచ్చలేదు.. 16వ అంతస్తు నుంచి దూకిన 13 ఏళ్ల బాలుడు

Boy Upset With Haircut: హెయిర్‌కటింగ్ నచ్చలేదని కలత చెంది 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పాడ్డాడు. మహారాష్ట్ర రాజధాని ముంబయి సబర్బన్ ఏరియా భయందర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన కజిన్‌తో కలిసి కటింగ్ చేసుకునేందుకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు.. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత చాలా పొట్టిగా చేశారని కలత చెందాడు. తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు ఎంతగా నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక..

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 6 Apr 2023, 5:30 pm

ప్రధానాంశాలు:

  • హెయిర్‌కటింగ్ పొట్టిగా చేశాడని బాలుడి మనస్తాపం.
  • తల్లిదండ్రులు, అక్కలు నచ్చజెప్పినా వినిపించుకోలేదు.
  • అందరూ నిద్రపోయాక బాత్రూమ్ కిటికీలో నుంచి కిందకు దూకి..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Representational Image
ప్రతీకాత్మక చిత్రం (Image: Starfish Kids Salon, Delhi)
హెయిర్ కటింగ్ బాగాలేదని కలత చెంది 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 16వ అంతస్తులో తాము నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో బాత్రూమ్ విండో నుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచాడు. కుటుంబసభ్యులందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హృదయవిదారకమైన ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై సబర్మన్ ప్రాంతం భయందర్‌లో మంగళవారం (ఏప్రిల్ 4) రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శత్రుఘ్న పాఠక్ (13 ఏళ్లు) అనే బాలుడు ముంబై సమీపంలోని భయందర్ పట్టణంలో ‘న్యూ గోల్డెన్ నెస్ట్‌’లోని సోనమ్ ఇంద్రప్రస్త్ భవనంలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వరుసకు అన్న అయ్యే ఓ వ్యక్తితో కలిసి మంగళవారం మధ్యాహ్నం అతడు హెయిర్‌కట్ చేయించుకోవడానికి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చాక అద్దంలో చూసుకొని తనకు కటింగ్ సరిగా చేయలేదని కలత చెందాడు. చాలా చిన్నగా చేశారని మనస్తాపానికి గురయ్యాడు.

శత్రఘ్నకు అతడి తల్లి, ఇద్దరు అక్కలు నచ్చజెప్పారు. కానీ, అతడు మనస్తాపంతో కుమిలిపోయాడు. రాత్రి 11.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులందరూ నిద్రపోయిన తర్వాత అతడు బాత్రూమ్‌లోకి వెళ్లి కిటికీలో నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడిఉన్న బాలుడిని గుర్తించి అపార్ట్‌మెంట్ వాసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.

పోలీసులు ‘ప్రమాదవశాత్తు మృతి’గా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.