యాప్నగరం

బెలూన్ కొనివ్వమన్నందుకు.. నాలుగేళ్ల చిన్నారిని చంపిన సవతి తండ్రి

బెలూన్ కొనివ్వమని అడిగినందుకు నాలుగేళ్ల చిన్నారిని సవతి తండ్రి చితకబాది, చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Samayam Telugu 11 Dec 2019, 6:08 pm
‘నాన్న బెలూన్ కొనివ్వు’ అని అడగడమే ఆ చిన్నారి పాపమైంది! నాలుగేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా చికతబాది, హతమార్చాడు కిరాతక సవతి తండ్రి. ఈ దారుణ ఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఖుల్దాబాద్‌లోని సిద్ధార్థనగర్‌లో అద్దెకు నివసిస్తున్న దంపతులు మందుల కోసం కూతురును వెంటబెట్టుకుని బయటకు వెళ్లారు.
Samayam Telugu child dead


Also Read: ‘హన్మకొండ’ హత్యాచార ఘటనలో భయం రేకెత్తించే దారుణాలు వెలుగులోకి..

ఆ సమయంలో బెలూన్‌ కావాలంటూ నాలుగేళ్ల చిన్నారి సవతి తండ్రిని కోరింది. దీంతో రెచ్చిపోయిన అతను చిన్నారిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టాడు. అడ్డొచ్చిన భార్యను సైతం బైక్‌పై నుంచి ఆమెను కిందపడేశాడు. అనంతరం ఆవేశంతో కూతురుని తీసుకుని వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకుని తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. దీంతో అనుమానం వచ్చి చిన్నారి తల్లి ఫోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. అనంతరం ఉదయాన్నే అతడి గదిలోకి వెళ్లి చూసి హతాశురాలైంది. తన కూతురిని భర్త చంపి, గాయాలతో పడి ఉన్నాడని ఆమె పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తను కత్తితో నరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.