యాప్నగరం

మైనర్ బాలికను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా చేసి.. రెచ్చిపోయిన ఈవ్‌ టీజర్లు

తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికను ఈవ్ టీజర్లు అర్ధనగ్నంగా చేసి.. ఆమె కుటుంబ సభ్యులపై సైతం దాడికి తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 17 Dec 2019, 8:27 pm
మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నా.. అతివలపై కీచక పర్వం మాత్రం ఆగడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో మరో మైనర్ బాలికపై కీచకులు రెచ్చిపోయారు. తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికను ఈవ్ టీజర్లు అర్ధనగ్నంగా చేసి.. ఆమె కుటుంబ సభ్యులపై సైతం దాడికి తెగబడ్డారు. గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu eve-teasing


Also Read: రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు మృతి

గౌతమ్, ముఖేష్ అనే ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలికపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధించేవారు. వీరిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హెచ్చరించారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు, బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

Also Read: నల్లగా ఉందని వెక్కిరింపు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ఈ నేపథ్యంలో బాధిత బాలిక ఆదివారం సాయంత్రం తన వదిన, తండ్రితో కలిసి చౌరీచౌరా పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా.. వారిపై నిందితులిద్దరూ దాడికి తెగబడ్డారు. రోడ్డుపైనే బాలిక దుస్తులు చించివేసి, అడ్డువచ్చిన ఆమె తండ్రిని తీవ్రంగా కొట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో నిందితులిద్దరినీ సోమవారం అరెస్టు చేశారు. నిందితులపై పోస్కో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read: భార్య గొంతు బ్లేడుతో కోసి.. కసి తీరక కూరగాయల కత్తితో నరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.