యాప్నగరం

భర్త లేని సమయంలో ప్రియుడితో ఆంటీ రొమాన్స్.. షాకిచ్చిన స్థానికులు

భర్త పక్క గ్రామంలో ఉద్యోగం చేస్తుండటంతో ముగ్గురు పిల్లలతో కలిసి స్వగ్రామంలో ఉంటున్న మహిళ ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో స్థానికులు వారిద్దరిని పట్టుకుని చితకబాదారు.

Samayam Telugu 13 Jul 2020, 3:59 pm
వివాహ కట్టుబాట్లను కాలదన్ని పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు గ్రామస్థులు తగిన బుద్ధి చెప్పారు. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని స్తంభానికి కట్టేసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోతీహరి జిల్లా బేలా గ్రామానికి మహిళకు కొంతకాలం క్రితం వివాహమై, ముగ్గురు పిల్లలున్నారు. భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది.
Samayam Telugu Image


Also Read: అక్రమ సంబంధం వద్దన్న వివాహిత.. తుపాకీ కాల్చి చంపి ప్రియుడి ఆత్మహత్య

భర్త అడ్డు లేకపోవడంతో ఆమె ప్రియుడిని రోజూ ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగించేది. మహిళ ప్రవర్తనను గమనించిన స్థానికులు పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోకుండా మరింత రెచ్చిపోయేది. దీంతో ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్న స్థానిక మహిళలు సమయం కోసం వేచిచూశారు. శనివారం ప్రియుడిని రప్పించుకుని గదిలో రాసలీలలు కొనసాగిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Also Read: భార్యను చంపి అడవిలో పడేసిన భర్త.. రెండు నెలల తర్వాత వీడిన మిస్టరీ

అర్ధనగ్నంగా ఉండగానే ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి స్తంభానికి కట్టేశారు. స్థానిక మహిళలు కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేయడంత వైరల్‌గా మారింది. అనైతిక సంబంధాన్ని కొనసాగిస్తున్న వారిని పెళ్లి చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

Also Read: కొంపముంచిన బాలుడి ఆన్‌లైన్ గేమ్.. 20 రోజుల్లో రూ.5.40 లక్షలు ఫట్‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.