యాప్నగరం

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి, 62 మందికి గాయాలు

Dindigul: తమిళనాడులోని దిండిగుల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 62 మంది గాయపడ్డారు.

Samayam Telugu 29 Mar 2021, 9:33 pm
మిళనాడులోని దిండిగుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్, టీఎన్‌ఎస్‌టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 62 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఓ ప్రైవేట్ మిల్లులో పనిచేసే కార్మికులతో వస్తున్న వ్యాన్‌, ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో వ్యాన్ డ్రైవర్‌, ఇద్దరు మహిళలు ఉన్నారు. బాట్లగుండు-దిండిగుల్‌ ప్రధాన రహదారిపై వతలగుండు సమీపంలో సోమవారం (మార్చి 29) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Road Accident


వ్యాన్‌‌లో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 54 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.