యాప్నగరం

అగ్నిప్రమాదం కాదు... భార్యే ప్రియుడితో కలిసి సజీవదహనం చేసింది... వనస్థలిపురం కేసులో కొత్త ట్విస్ట్

భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించిన స్వప్న అతడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. పథకం ప్రకారం నవంబర్ 26న రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో స్వప్న ప్రియుడు వెంకటయ్యతో కలిసి గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పింటించింది.

Samayam Telugu 5 Dec 2019, 4:14 pm
హైదరాబాద్ నగర శివారు వనస్థలిపురం‌లో నవంబర్ 26న గుడిసె అంటుకుని సజీవదహనమైన రమేశ్‌ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అందరూ గుడిసె ప్రమాదవశాత్తూ తగులబడిందని అనుకుంటుండగా పోలీసుల విచారణలో కొత్తకోణం వెల్లడైంది. ముందుగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగిందను అనుమానించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఎవరూ ఊహించని విధంగా విచారణలో కళ్లు చెదిరే నిజాలు వెల్లడి కావడంతో పోలీసులే షాకయ్యారు.
Samayam Telugu suicides


Also Read: ఉన్నావో: గ్యాంగ్ రేప్ బాధితురాలికి నిప్పంటించిన నిందితులు

ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మృతుడి భార్య హస్తం కూడా ఉన్నట్లు తెలుసుకుని షాకయ్యారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌కేడీ నగర్‌లో రమేష్ భార్య స్వప్నతో కలిసి నివసించేవాడు. ఈ క్రమంలోనే ఆమె వెంకటయ్య అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను పట్టించుకోకుండా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగేది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి.

Also Read: అద్దె ఇంట్లో వ్యభిచారం.. ఐదుగురు సెక్స్‌వర్కర్లు, ముగ్గురు విటుల అరెస్ట్

ఈ క్రమంలో భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించిన స్వప్న అతడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. పథకం ప్రకారం నవంబర్ 26న రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో స్వప్న ప్రియుడు వెంకటయ్యతో కలిసి గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పింటించింది. దీంతో నిద్రలో ఉన్న రమేశ్‌ సజీవదహనమయ్యాడు. సంఘటనా స్థలంలో స్వప్న రోదించిన తీరుతో స్థానికులందరూ ఆమెపై జాలిపడ్డారు. తొలుత పోలీసులు కూడా ఆమె చెప్పిన ప్రకారమే వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించిన తర్వాత వారికి అనుమానం వచ్చింది. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టడంతో స్వప్న, వెంకటయ్యల అక్రమ వ్యవహారం బయటపడింది. లైంగిక సుఖం కోసం ఓ నిండు ప్రాణం తీసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఇంట్లోకి చొరబడి.. నోట్లో గుడ్డలు కుక్కి.. గుంటూరులో వివాహితపై అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.