యాప్నగరం

రూ.4.50లక్షల అప్పుకు రూ.16లక్షల వడ్డీ.. యువకుడిని బలి తీసుకున్న కాల్‌మనీ వేధింపులు

తీసుకున్న అప్పుకు రూ.16లక్షల వడ్డీ కట్టినా ఆ నలుగురు నన్ను వదిలిపెట్టలేదని, దీనిపై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ప్రేమ్ సెల్ఫీ వీడియోలో తెలిపారు.

Samayam Telugu 29 Dec 2019, 4:50 pm
విజయవాడలో వడ్డీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. కాల్‌మనీ వేధింపులు తాళలేక ప్రేమ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ సూసైడ్ వీడియో తీసిన బాధితుడు తన చావుకు కారణమైన వారి వివరాలు చెప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అమరావతి ప్రాంతంలో కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
Samayam Telugu suicide


Also Read: అనుమానపు మొగుడు.. అఫైర్ పెట్టుకోకుండా భార్య యోనికి తాళం వేశాడు

విజయవాడకు చెందిన ప్రేమ్ అనే యువకుడు కొంతకాలం క్రితం వడ్డీకి రూ.నాలుగున్నర లక్షల డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే వడ్డీ పేరుతో అతడిని వేధించిన వ్యాపారులు ఏకంగా రూ.16లక్షల వడ్డీ వసూలు చేశారు. అయినప్పటికీ ఇంకా డబ్బు కట్టాలంటూ వేధించసాగారు. దీంతో విసిగిపోయిన బాధితులు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని.. కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేశ్‌ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.

Also Read: మధ్యప్రదేశ్‌లో మరో నిర్భయ.. కదులుతున్న బస్సులోనే బాలికపై గ్యాంగ్ రేప్

రూ.4.50లక్షల అప్పుకు రూ.16లక్షల వడ్డీ కట్టినా ఆ నలుగురు నన్ను వదిలిపెట్టలేదని, దీనిపై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ప్రేమ్ సెల్ఫీ వీడియోలో తెలిపారు. పోలీసుల ఎదుటే తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రేమ కాలువలో దూకినట్లు తెలియగానే విజయవాడ పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడి మృతదేహం ఇంకా దొరకలేదు. మరోవైపు తన భర్త ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రేమ భార్య పోలీసులను డిమాండ్ చేస్తోంది.

Also Read: యువతిని గర్భవతిని చేసిన పెదనాన్న కొడుకు.. తెలంగాణలో మరో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.