యాప్నగరం

విజయవాడలో మరో కీచక ఘటన.. చిన్నారిపై రౌడీషీటర్ అత్యాచారం

గవర్నర్‌పేటకు చెందిన రౌడీ షీటర్ బాలికను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 19 Dec 2019, 4:09 pm
తెలుగు రాష్ట్రాల్లో కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదొక చోట అబలలపై కామాంధులు విరుచుకుపడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు వారి పైశాచికానికి బలైపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఓ చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu girl rape


Also Read: యజమాని భార్యతో అఫైర్.. శవమై కనిపించిన ఉద్యోగి.. ఐదు నెలల తర్వాత ట్విస్ట్

విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన చిన్న రాజా అనే రౌడీషీటర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: తమిళనాడులో మహిళా టీచర్ ఆత్మహత్య.. విషాదంలో తెలుగువారు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం ‘దిశ’ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి దోషులకు శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. అయితే దురదృష్టవశాత్తూ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించిన డిసెంబర్ 13వ తేదీన గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కఠినచట్టం వచ్చిందన్న భయం కామాంధుల్లో ఎక్కడా కనిపించడం లేదని చెప్పడానికి నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Also Read: యువతిని తల్లిని చేసిన వివాహితుడు... గొంతు కోసి చంపేసిన బాధితురాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.