యాప్నగరం

బావిలో పడి ఇద్దరు మృతి.. కృష్ణా జిల్లాలో విషాదం

బావిలో పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాత బావి పూడ్చే క్రమంలో ప్రమాదవశాత్తూ నలుగురు వ్యక్తులు బావిలో పడిపోయారు.

Samayam Telugu 18 Sep 2020, 5:35 pm
కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాడుబడిన బావిలో పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన బాపులపాడు మండలం మల్లవల్లిలో చోటుచేసుకుంది. నూజివీడు మండలం పోనసనపల్లికి చెందిన 8 మంది కూలీలు పాతబావిని పూడ్చేందుకు మల్లవల్లి వచ్చారు. పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ నలుగురు కూలీలు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


కూలీలు అచ్చి తిరుపతయ్య(60), అచ్చి రమేష్ (40) మృత్యువాతపడినట్లు గుర్తించారు. పాడుబడిన బావి కావడంతో మృతదేహాలు మట్టిలో పూడుకుపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీని పిలిపించి సహాయక చర్యలు చేపట్టారు.

Read Also: విజయవాడలో రైడింగ్ ఎక్కువైందని.. రూటు మార్చిన వ్యభిచార ముఠా.. కనిపెట్టిన ఖాకీలు

Also Read: అన్న ప్రేమ తమ్ముడి చావుకొచ్చింది.. పోలీస్ దెబ్బలకే చనిపోయాడా? లేక..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.