యాప్నగరం

మహిళా సర్పంచ్ ఆత్మహత్య.. వికారాబాద్‌లో విషాదం

మహిళా ప్రజాప్రతినిధి పురుగుల మందు తాగి ప్రాణాలొదిలిన సంఘటన వెలుగుచూసింది. వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది.

Samayam Telugu 26 Mar 2020, 2:14 pm
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ప్రజాప్రతినిధి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. యాలాల మండలం తిమ్మాయి పల్లి సర్పంచ్ అపర్ణ సూసైడ్ చేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన అపర్ణ అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగేసింది. గమనించిన అపర్ణ కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu death4


అయితే ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచింది. మహిళా సర్పంచ్ మృతి వార్త స్థానికంగా కలకలం రేపింది. ఆమె ఆత్మహత్య కారణాలు తెలియాల్సి ఉంది. సర్పంచ్‌గా ఉన్న మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడం కుటుంబ సభ్యులు, గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: సామాజిక దూరం పాటించమన్నందుకు దారుణం.. కత్తితో పొడిచి కిరాతకంగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.