యాప్నగరం

గుంటూరు: గ్రామ వాలంటీర్ భార్య మృతి.. అల్లుడిపై మామ ఫిర్యాదు

గుంటూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ భార్య అనుమనాస్పదంగా మరణించిన ఘటనపై కేస నమోదైంది. తమ కూతురి మరణానికి అల్లుడే కారణమని మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 28 Aug 2020, 12:08 pm
గుంటూరు జిల్లాలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. నాదెండ్ల మండల పరిధిలోని సాతులూరులో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న పల్లపాటి ఏడుకొండలుకు పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన వేల్పుల కృష్ణ తన కుమార్తె మహాలక్ష్మి(24)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగబిడ్డను కనలేదన్న కారణంతో భర్త ఆమెను చిన్నచూపు చూసేశాడు. భర్త వేధింపులు భరించలేక మహాలక్ష్మీ కొంతకాలం క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు దంపతుల మధ్య రాజీ కుదిర్చి ఆమెను తిరిగి కాపురానికి పంపించారు.
Samayam Telugu Image


Also Read: విశాఖ: మహిళా వాలంటీర్‌కు లైంగిక వేధింపులు.. ప్రశ్నించిన భర్త, మరిదిపై దాడి

అయినప్పటికీ ఏడుకొండలులో ఎలాంటి మార్పు రాకపోగా భార్యను మరింత వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆమె చనిపోయింది. దీంతో ఏడుకొండలు అత్తమామలకు ఫోన్ చేసి మీ కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి వేల్పుల కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని భర్త, అత్తింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also Read: ఆదిలాబాద్: ప్రేమంటూ షికార్లు చేసి ఉద్యోగం రాగానే వదిలేశాడు

మహాలక్ష్మీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. తహశీల్దారు అయోధ్య సాంబశివరావు, పోలీసు అధికారుల సమక్షంలో డాక్టర్లు గురువారం శవ పంచనామా నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాదెండ్ల ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.

Also Read: కొత్తగూడెం: పెళ్లికి ముందు రోజే ప్రియుడితో వధువు పరార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.