యాప్నగరం

Online Rummy: ప్రాణాలు తీసిన పేకాట.. విశాఖలో విషాదం

నావెల్ డాక్ యార్డులో ఉద్యోగం చేస్తున్న సతీష్ ఆన్‌లైన్ రమ్మీ ఆడేవాడు. దానికి బానిసగా మారిన సతీష్ భారీగా అప్పులు చేసి రమ్మీలో పోగొట్టుకున్నాడు. తీరా చివరికి..

Samayam Telugu 15 Nov 2020, 3:54 pm
విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పేకాట వ్యసనం ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. ఆన్‌లైన్ రమ్మీలో భారీగా డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన ఉద్యోగి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాబిడ్డలను నట్టేట ముంచాడు. నగరంలోని గోపాలపట్నం శివారు కొత్తపాలేనికి చెందిన మద్దాల సతీష్ నావెల్ డాక్‌ యార్డులో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దికాలంగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసగా మారిన సతీష్ పేకాటలో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rummy


సుమారు కోటి రూపాయల వరకూ పేకాటలో పోగొట్టుకుని అప్పలుపాలైనట్లు తెలుస్తోంది. అప్పులు తీర్చే మార్గం కనిపించక అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య ప్రత్యూష(28), కూతురు సాయి మోక్షిత(6) ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని విశాఖ రైల్వే ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: హత్య చేసి.. శవాన్ని లారీలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కి.. ఖమ్మంలో షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.