యాప్నగరం

భార్య కనీస విలువ ఇవ్వడంలేదని.. గోడపై పేర్లు రాసి..

భార్య కనీసం మర్యాద ఇవ్వడం లేదని, తనను పట్టించుకోవట్లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 18 Jan 2020, 3:16 pm
కట్టుకున్న భార్య కనీసం విలువ ఇవ్వడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖపట్నం నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ న్యూపోర్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. 50వ వార్డు ప్రియదర్శినీ కాలనీకి చెందిన లండా శివశంకర్‌ (26)కు పెదగంట్యాడ గొందేశివీధికి చెందిన యువతితో 2018 నవంబర్‌లో ప్రేమ వివాహం జరిగింది.
Samayam Telugu suicide


స్వతహాగా ఫొటోగ్రాఫర్ అయిన శివశంకర్.. ఫొటోగ్రఫీ నిమిత్తం దంపతులు హైదరాబాద్‌ వెళ్లారు. ఇటీవలే వీరికి పాప పుట్టి చనిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గత నెల డిసెంబర్‌లో గాజువాక వచ్చారు. ఇద్దరి మధ్య సఖ్యత కుదరక శివశంకర్ ప్రస్తుతం ప్రియదర్శిని కాలనీలో తండ్రి రామారావు వద్దే ఉంటున్నారు. భార్య పెదగంట్యాడలోని పట్టింట్లో ఉంటోంది.

Also Read: ప్రకాశంలో నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికిన భార్య

ఈ క్రమంలో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం వెళ్లగా శివశంకర్ ఒంటరిగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. భార్య తనకు కనీస విలువ ఇవ్వడంలేదని, ఇంటికెళ్తే పట్టించుకోవడం లేదని తరచూ మనస్తాపం చెందేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం అతనికి టిఫిన్‌ ఇచ్చేందుకు సోదరుడు వెళ్లి చూడగా ఫ్యాన్‌ హుక్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అయితే ఇంటి తలుపుపై తన చావుకు అత్త, బావమరిది తదితరులు కారణమంటూ రాసి ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు ప్రశాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: వివాహితతో అక్రమ సంబంధం.. ఆమె కూతురిపైనా కన్నేశాడు.. చివరకు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.