యాప్నగరం

సచివాలయ ఉద్యోగినికి ప్రేమ వేధింపులు.. సజీవ దహనం చేస్తానంటూ బెదిరింపు

ప్రేమ పేరుతో సచివాలయ ఉద్యోగినిని కొంతకాలంగా వేధిస్తున్న ప్రశాంత్ గురువారం ఆమె ఆఫీసుకి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించకపోతే పెట్రోల్ పోసి నిప్పు పెడతానని బెదిరించాడు.

Samayam Telugu 26 Jun 2020, 8:15 am
సచివాలయ ఉద్యోగినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించిన ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి గ్రామంలో చోటుచేసుకుంది. అరఢకోట గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న యువతిని అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. గురువారం ఏకంగా ఆమె ఆఫీసుకే వెళ్లి బయటకు రావాలంటూ డిమాండ్ చేశాడు. తన ప్రేమను అంగీకరించకపోతే పెట్రోల్ పోసి దహనం చేస్తానని, ఎవరొచ్చి కాపాడతారో చూస్తానని బెదిరించాడు.
Samayam Telugu Image


Also Read: తెలంగాణా మద్యం కేసులో ఇరుక్కున్న టాలీవుడ్ డైరెక్టర్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

తాను విధుల్లో ఉన్నానని, ఇక్కడికొచ్చి గొడవ చేయడం మంచిది కాదని ఆమె చెప్పినా వినకుండా చేయి చేసుకున్నాడు. దీంతో మిగతా సిబ్బంది ప్రశాంత్‌ను అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనతో భయపడిపోయిన యువతి వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారమిచ్చింది. వారు వెంటనే అక్కడికి చేరుకుని కూతురిని ఇంటికి తీసుకెళ్లారు. ప్రశాంత్‌ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితురాలు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో పూర్ణయ్యకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు, ప్రశాంత్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: అర్ధరాత్రి రైలు పట్టాలపై శవమైన బాలిక.. ప్రియుడిపై తల్లిదండ్రుల అనుమానం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.