యాప్నగరం

అప్పు తీర్చలేదని అరాచకం.. యువకుడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

స్నేహితుల దగ్గర దంతేశ్వరరావ్‌ రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు. వారు తిరిగివ్వాలని కోరగా ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. దీంతో వారు అతడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు.

Samayam Telugu 20 May 2020, 11:05 am
విశాఖనగరం మధురవాడలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో స్నేహితులే ఓ యువకుడ్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా చితకబాదారు. మారికవలసలోని రాజీవ్‌ గృహకల్ప వద్ద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దంతేశ్వరరావ్‌ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం స్నేహితుల వద్ద రూ.5వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగివ్వాలని అడగ్గా ఇప్పుడు తన దగ్గర లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఐదుగురు స్నేహితులు అతడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు.
Samayam Telugu దంతేశ్వరరావును చిత్రహింసలు పెడుతున్న స్నేహితులు


Also Read: ‘నాన్నను చంపింది అమ్మ, అంకులే’.. 12ఏళ్ల బాలుడి సాక్ష్యంతో వీడిన మిస్టరీ

ఓ సమయంలో అతడి మెడకు తాడు బిగించిన యువకులు గట్టిగా లాగడంతో బాధితుడు విలవిల్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరంగా ఓ గ్యాంగ్‌గా ఏర్పడి ఆరు నెలలుగా రౌడీయిజం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితులపై ఐపీసీ 352 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read: ఆరేళ్లు కాపురం చేసి అనుమానంతో భార్య హత్య.. ప.గో జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.