యాప్నగరం

వరంగల్: కన్న కొడుకును సజీవ దహనం చేసిన తల్లి

డబ్బు కోసం వేధిస్తున్న కొడుకును ఓ తల్లి సజీవదహనం చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Samayam Telugu 22 Sep 2020, 10:55 pm
కడుపున పుట్టిన బిడ్డనే ఓ తల్లి అత్యంత కిరాతకంగా చంపేసింది. వేధింపులు భరించలేక కన్న కొడుకును దారుణంగా హతమార్చింది. నిద్రలోనే ఉండగానే కుమారుడిపై కిరోసిన్ పోసి తగులబెట్టేసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఖిలా వరంగల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu కొడుకును సజీవ దహనం చేసిన తల్లి


మిల్స్‌ కాలనీ సీఐ నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖిలా వరంగల్‌ నగరంలోని పడమర కోటకు చెందిన కోండ్ర రాజేంద్ర ప్రసాద్ (40).. దాదాపు 15 ఏళ్ల క్రితం భార్యాపిల్లలతో గొడవపడి తల్లి సరోజినితో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొంతకాలంగా మద్యానికి బానిసైన రాజేంద్రప్రసాద్.. డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా డబ్బు ఇవ్వాలంటూ తల్లితో గొడవపడ్డాడు.

రోజూ కొడుకు తాగొచ్చి పెట్టే హింసతో తీవ్ర మనస్తాపం చెందిన సరోజన.. నిద్రలో ఉన్న రాజేంద్రప్రసాద్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించింది. గట్టిగా కేకలు వేస్తూ రాజేంద్రప్రసాద్ సజీవదహనమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ ఏసీపీ కిరణ్‌ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతుడి సోదరుడు వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.