యాప్నగరం

Warangal: కరోనా సోకిందని పురుగుల మందు తాగేసిన మహిళ

కరోనా పరీక్షలు చేయించుకున్న మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్య సిబ్బంది అందజేసిన కిట్ తీసుకుని ఇంటికి బయల్దేరిన మహిళ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Samayam Telugu 26 Jul 2020, 6:01 pm
కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది. కరోనా వైరస్ సోకిందని తెలిసి మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషాద ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ పరిధిలోని హసన్‌పర్తి ఆరోగ్యం కేంద్రంలో మహిళ(50) కరోనా పరీక్షలు చేయించుకుంది. ఆమెకు పాజిటివ్‌గా తేలడంతో వైద్య సిబ్బంది. ఆమెకి హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించి.. మెడికల్ కిట్ అందజేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona suicide


హోం ఐసోలేషన్ కిట్ తీసుకుని ఇంటికి బయల్దేరిన మహిళ అఘాయిత్యానికి పాల్పడింది. కరోనా సోకిందన్న భయంతో పురుగుల మందు తాగేసింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కరోనా భయంతో మహిళ ప్రాణాలు తీసుకోవడం స్థానికులను కలచివేసింది.

Also Read: కరోనా వచ్చిందంటూ హేళన.. వ్యక్తి ఆత్మహత్య.. అనంతపురంలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.