యాప్నగరం

భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తను కత్తితో నరికి..

భార్యతో గొడవ పడుతుండగా అడ్డు వచ్చిన అత్తను కత్తితో నరికి చంపాడో వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పాతఊరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Samayam Telugu 11 Dec 2019, 4:08 pm
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పాతఊరిలో దారుణం చేటుచేసుకుంది. భార్యతో గొడవ పడుతుండగా అడ్డు వచ్చిన అత్తను దారుణంగా నరికి చంపాడు. దుర్గాప్రసాద్‌, వరలక్ష్మి దంపతులకు 7 నెల క్రితం వివాహమైంది. అయితే హైదరాబాద్‌లోని రెయిన్‌బో ప్రింటింగ్‌ ప్రెస్‌లో దుర్గాప్రసాద్‌ పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి అత్తారింటికి వచ్చిన దుర్గాప్రసాద్‌ భార్యతో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో.. వారికి సర్ది చెప్పేందుకు దుర్గాప్రసాద్‌ అత్త లక్ష్మి ప్రయత్నించింది.
Samayam Telugu lakshmi murder


Also Read: ‘హన్మకొండ’ హత్యాచార ఘటనలో భయం రేకెత్తించే దారుణాలు వెలుగులోకి..

దీంతో కోపంతో రగిలిపోయిన దుర్గాప్రసాద్‌ అత్తపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా రక్తం కారుతుండటంతో లక్ష్మి కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు బాధితురాలని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. కుటుంబ తగాదాల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితమే దుర్గాప్రసాద్‌ భార్య వరలక్ష్మి పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

Also Read: తల్లీబిడ్డ దారుణ హత్య.. అయ్యప్ప స్వాముల సాక్ష్యంతో హంతకుడు వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.