యాప్నగరం

బాలికను కిడ్నాప్ చేసి కారులోనే అఘాయిత్యం.. ఇద్దరిపై కేసు

ఈ నెల ఏడో తేదీన బాలికను కారులో వచ్చిన కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మహబూబ్‌నగర్‌ వరకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 13 Jun 2020, 10:37 am
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి కారులోనే అత్యాచారానికి యత్నించిన ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బాలిక (17) ఏడాది కాలంగా ఆకివీడు మండలంలోని ఓ గ్రామంలో తన నాయనమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 7న అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాలిక కనిపించకపోవడంతో నాయనమ్మ ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu Image


Also Read: ‘ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడు’.. మహిళ ఫిర్యాదుతో సినీ హీరో అరెస్ట్

మరోవైపు బాలికను మహబూబ్‌నగర్ తీసుకెళ్లిన దుండగులు అక్కడ కారులోనే ఆమెపై అత్యాచారానికి యత్నించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత బాలిక హైదరాబాద్‌లో ఉండే తన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేసింది. దీంతో తన కూతురిని వెంటబెట్టుకుని ఆయన శుక్రవారం ఆకివీడు చేరుకుని ఫిర్యాదు చేశాడు. బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు, అతడికి సహకరించిన కారు డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.. 8 నెలలకే ఆత్మహత్య.. కృష్ణా జిల్లాలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.