యాప్నగరం

25 మంది విద్యార్థులున్న పాఠశాల బస్సు దగ్ధం..

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం మీనానగరం వద్ద పాఠశాల బస్సు దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు.

Samayam Telugu 13 Dec 2019, 7:20 pm
పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చాగల్లు మండలం మీనానగరం వద్ద పాఠశాల బస్సు దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు.. 25 మంది విద్యార్థులతో చాగల్లు బయల్దేరింది. ఈ క్రమంలో బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు బస్సు అంతటా విస్తరించసాగాయి.
Samayam Telugu WEST BUS


Also Read: అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి విద్యార్థులను కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది. అయితే బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read: ఇష్టం లేని పెళ్లి చేశారని.. వరుడి బలవన్మరణం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.