యాప్నగరం

ఐదో తరగతి బాలికలపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు..

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Samayam Telugu 24 Dec 2019, 10:13 am
విద్యాబుద్ధులు నేర్పాల్సిన చెప్పాల్సిన గురువు బాలికల పాలిట కీచకుడుగా మారాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు..
Samayam Telugu eve-teasing


Also Read: వరంగల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం


ఏలూరుకు చెందిన కూరపాటి కిశోర్‌ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం కూడా ఉపాధ్యాయుడు అదే తరహాలో ప్రవర్తించాడు. దీంతో మధ్యాహ్న సమయంలో ఇంటికెళ్లిన బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.

దీంతో వారంతా పాఠశాల వద్దకు వచ్చి కిశోర్‌ను నిలదీశారు. అనంతరం స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై రెండు పోక్సో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: నెల్లూరులో పదేళ్ల బాలికపై అత్యాచారం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.