యాప్నగరం

23 ఏళ్లకే ఆమెకు మూడు పెళ్లిళ్లు.. నాలుగో పెళ్లి కోసం ఘాతుకం

మొదటి భర్తని వదిలేసింది. ఆ తరువాత రెండు వివాహాలు చేసుకున్నప్పటికీ ఇద్దరూ మృత్యువాతపడ్డారు. చివరికి నాలుగో పెళ్లి కోసం దారుణానికి పాల్పడింది.

Samayam Telugu 29 Sep 2020, 6:16 pm
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న మహిళ నాలుగో పెళ్లికి రెడీ అయింది. అడ్డుగా ఉన్నాడని మాటలు కూడా రాని కన్నకొడుకుని అత్యంత కిరాతకంగా నీటముంచి చంపేసింది. ఈ దారుణ ఘటన బిహార్‌లో జరిగింది. పట్నాలోని బహదూర్‌చక్ ఏరియాకి చెందిన ధర్మషీలా దేవి(23)కి నలంద జిల్లా భదౌల్‌కి చెందిన అరుణ్ చౌదురితో వివాహమైంది. వారికి కొడుకు సజన్ కుమార్ పుట్టాడు. సజన్‌ మూగవాడు. కళ్లు కూడా సరిగా కనపడవు. కొడుకు పుట్టిన ఏడాదికి దేవి భర్త నుంచి విడిపోయింది.
Samayam Telugu widow kills 4 year old son for 4th marriage
23 ఏళ్లకే ఆమెకు మూడు పెళ్లిళ్లు.. నాలుగో పెళ్లి కోసం ఘాతుకం


మరొకరిని వివాహం చేసుకున్నప్పటికీ అతను మృతి చెందాడు. అనంతరం ముస్తఫాపూర్‌కి చెందిన మహేష్ చౌదురిని మూడో వివాహం చేసుకుంది. అతను కూడా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో ఆమె నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. అందుకు తన దివ్యాంగుడైన కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి ఘాతుకానికి పాల్పడింది. షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్సన్‌పూర్ ఖందా ప్రాంతానికి తీసుకెళ్లి నీళ్లలో ముంచి చంపేసింది.

Also Read: అక్కతో చనువుగా ఆటోడ్రైవర్.. తగలబెట్టేసిన తమ్ముడు.. దారుణం

మరుసటి రోజు బాలుడి మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని తల్లి దేవిని అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు నిజం కక్కేసింది. నాలుగో పెళ్లి కోసం కొడుకుని తానే హత్య చేసినట్లు ఒప్పేసుకుంది. మొదటి భర్త అరుణ్ చౌదురి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: అన్యోన్య దంపతులు.. తెల్లారేసరికి శవమైన భార్య.. కడపలో మిస్టరీగా మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.