యాప్నగరం

ఉద్యోగం ఇప్పిస్తామని ఆశచూపి.. వితంతు మహిళపై గ్యాంగ్ రేప్

ఉద్యోగం పోయి ఇబ్బందులెదుర్కొంటున్న మహిళపై కామాంధులు కన్నేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ముగ్గురు పిల్లల తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

Samayam Telugu 16 Aug 2020, 6:38 pm
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన మహిళ నిస్సహాయతను అవకాశంగా తీసుకుని అకృత్యానికి పాల్పడ్డారు దుర్మార్గులు. పిల్లలను పోషించుకునేందుకు ఉద్యోగం అడిగిన వితంతు మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన బిహార్‌ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. నగరంలోని కాంకర్‌బాగ్ ఏరియాకి చెందిన మహిళకి పదేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు సంతానం. భర్త కొద్దికాలం కిందట అనారోగ్యంతో మరణించడంతో ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


కరోనా కారణంగా ఆమె ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆమె ఇంటికి సమీపంలోనే ఉండే ఇద్దరు యువకులు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశచూపారు. నిజమేనని నమ్మేసిన ఆమె వారు రమ్మన్న చోటికి వెళ్లింది. గదికి తీసుకెళ్లిన కామాంధులు ఆమెను దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెపై పడి పశువుల్లా కామవాంఛలు తీర్చుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగో బయటపడిన బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఇంటి ఓనర్ భార్యతో మాటలు కలిపిన భర్త.. భార్య కంటపడడంతో.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.