యాప్నగరం

హైదరాబాద్‌‌లో కిలాడీ భార్యాభర్తలు.. వారి ఎత్తులకు జనం లబోదిబో..

Moti Nagar: రెహమత్ నగర్, శ్రీనగర్ కాలనీకి చెందిన పలువురి నుంచి రూ.13 కోట్ల వరకు వసూలు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ఎంతో మందిని వీళ్ళు ఫైనాన్స్ పేరుతో మోసం చేశారు.

Samayam Telugu 21 Aug 2020, 9:10 pm
హైదరాబాద్‌ బోరబండలోని మోతీ నగర్‌కు చెందిన కిలాడీ భార్యాభర్తలు ఫైనాన్స్ బిజినెస్ పేరుతో ఏకంగా రూ.13 కోట్లు కాజేశారు. సినీ ఇండస్ట్రీలో ఫైనాన్స్ చేస్తున్నామని అందరికీ చెప్పుకొని చెలామణి అయ్యారు. తమ దగ్గర పెట్టుబడి పెడితే 10 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి అందర్నీ నమ్మించారు. ఈ విధంగా అందరినీ బుట్టలో వేసుకొని వారి దగ్గర నుంచి దాదాపు రూ.13 కోట్లను జమచేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (Picture Credit: Pixabay)
Wife and husband cheats people


Also Read: undefined

రెహమత్ నగర్, శ్రీనగర్ కాలనీకి చెందిన పలువురి నుంచి రూ.13 కోట్ల వరకు వసూలు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ఎంతో మందిని వీళ్ళు ఫైనాన్స్ పేరుతో మోసం చేశారు. చివరికి రూ.13 కోట్లతో పరారయ్యారు. తన వద్ద డబ్బులు తీసుకుని అసలు, వడ్డీ ఇవ్వకపోవడంతో విజయ లక్ష్మీ అనే మహిళ మోసపోయానని గ్రహించి వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పద్మజ, వరప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.