యాప్నగరం

భార్య వేధింపులు, దుబారా ఖర్చులు భరించలేక టెక్కీ ఆత్మహత్మ

దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని ఎంత చెప్పినా భార్య వినిపించుకోకపోవడం, ఫ్లాట్ తన తండ్రి పేరు మీద రాయాలని ఒత్తిడి చేయడంతో తట్టుకోలేకపోయిన శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 15 Dec 2019, 12:29 pm
భార్య వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. భార్య పెడుతున్న దుబారా ఖర్చులు భరించలేక, నిత్యం ఆమె సూటిపోటి మాటలకు మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనాథ్‌కు భార్య రేఖ, కుమార్తె ఉన్నారు. ఇటీవల అతడు హోమ్‌లోన్ మీద ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
Samayam Telugu మాయంలనెిె


Also Read: యువతితో ఇద్దరు బిడ్డల తండ్రి ప్రేయాయణం.. నిజం తెలిసి తట్టుకోలేక

ఇటీవల ఆర్థిక అవసరాలు పెరగడంతో శ్రీనాథ్‌కు లోన్ ఈఎంఐ కట్టడమే కష్టంగా మారింది. ఇవన్నీ పట్టించుకోని భార్య రేఖ దుబారా ఖర్చులు చేయడం మొదలుపెట్టింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని అతడు ఎంత చెప్పినా ఆమె వినిపించుకోకుండా ఆదాయానికి మించి ఖర్చులు చేస్తోంది. దీనికి తోడు ఫ్లాట్‌ను తన తండ్రి పేరుమీద రిజిస్టర్ చేయాలని రేఖ భర్తను తీవ్రంగా పట్టుబడుతోంది. దీంతో కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Also Read: విదేశీ అమ్మాయిలతో ప్రముఖుల రాసలీలలు. గోవాలో మరో సెక్స్‌రాకెట్‌ గుట్టురట్టు

భార్య కలిగించే మానసి వేదనతో విసిగిపోయిన శ్రీనాథ్ చివరికి చావే పరిష్కారమనుకున్నాడు. తన ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల విచారణలో రేఖ వేధింపులే శ్రీనాథ్ ఆత్మహత్యకు కారణమని తేలడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అయేషా మీరా అవశేషాలు సేకరించిన సీబీఐ.. రీపోస్ట్‌మార్టం ఎలా జరిగిందో తెలుసా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.