యాప్నగరం

భర్తను చంపి బెడ్రూమ్‌లో కుక్కిన భార్య.. ఘాతుకం

కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. సడెన్‌గా భర్త కనిపించకుండాపోయాడు. అనుమానం వచ్చిన స్థానికులు..

Samayam Telugu 30 Aug 2020, 4:22 pm
కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య. తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయి భర్తని దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బెడ్రూమ్‌లోనే పూడ్చిపెట్టి పరారైంది. గ్రామస్తులు ఉప్పందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భర్త మృతదేహాన్నివెలికితీసి భార్యను అరెస్టు చేశారు. ఈ అత్యంత దారుణ ఘటన త్రిపురలోని ధలైలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
grave


జిల్లాలోని భక్తికుమార్‌పురా గ్రామానికి చెందిన సంజిత్ రియాంగ్(30), భార్తి(21) భార్యాభర్తలు. పెళ్లైన తర్వాత కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఏదో విషయమై ఇద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. దంపతుల మధ్య మరోమారు వివాదం చోటుచేసుకోవడంతో చినికిచినికి గాలివానగా మారింది. భర్తతో విసిగిపోయిన భార్య దారుణానికి పాల్పడింది.

Also Read:
కడపలో దారుణం.. మైనర్ బాలికపై వీఆర్‌ఏ అత్యాచారం

కట్టుకున్న భర్త అనే కనికరం లేకుండా అమానుషంగా అంతమొందించింది. హత్యానంతరం భర్త శవాన్ని బెడ్రూమ్‌లోనే పాతిపెట్టి పరారైంది. అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో దారుణం వెలుగుచూసింది. ఇంట్లోనే పాతిపెట్టిన భర్త మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు సమీప గ్రామంలోనే తలదాచుకున్న భార్యను గుర్తించి అరెస్టు చేశారు. అయితే ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా ఎస్పీ కిశోర్ తెలిపారు.

Read Also:
నేవీ ఉద్యోగి భార్య ఆత్మహత్య.. వేధింపులు భరించలేక.! గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.