యాప్నగరం

ప్రియుడితో రాసలీలలు.. భర్తకి ఫుల్లుగా తాగించి.. సంగారెడ్డిలో దారుణం

ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసిందో భార్య. అక్రమ సంబంధానికి అడ్డుతొలగించుకునేందుకు దారుణంగా చంపి నడిరోడ్డుపై పడేసింది.

Samayam Telugu 21 Feb 2020, 6:25 pm
రోజురోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల మోజులో అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా చంపేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. భర్తకు తెలీకుండానే మర్డర్ చేసి పరలోకాలకు పంపేసింది. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Samayam Telugu death3


సంగారెడ్డి జిల్లాలోని బీరప్ప బస్తీకి చెందిన వెంకటయ్య, వెంకటమ్మ దంపతులు. వెంకటమ్మ కొద్దికాలంగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం నెరుపుతోంది. భర్త లేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. ఎప్పటికైనా భర్తతో ఇబ్బందేనని భావించిందేమో.. ఏకంగా అతనిని అంతమొందించేందుకు పథకం రచించింది. భర్త మద్యం తాగే అలవాటును ఆయుధంగా మలచుకుంది.

Also Read: అంతా రామలక్ష్మి కోసమే.. సజీవ దహనం కేసులో సంచలన విషయాలు

మరో మహిళతో కలిసి మర్డర్ ప్లాన్‌ను అమలు చేసింది. ఓ రోజుకు భర్తకు మందు ఆఫర్ చేసింది. భార్య స్వయంగా మద్యం ఇవ్వడంతో ఫుల్లుగా తాగేశాడు. మద్యం మత్తులో పడిపోయిన భర్తను దారుణంగా పొడిచి చంపేసింది భార్య. మృతదేహాన్ని తీసుకెళ్లి అమీన్‌పూర్ లాలాబాయి కాలనీ వద్ద పడేసింది.

Read Also: భార్య చెల్లెలిపై కన్నేసి.. న్యూడ్ ఫొటోలు తీసి.. గుంటూరులో దారుణం

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పోలీసు విచారణలో భార్య వెంకటమ్మే హత్య చేసినట్లు తేలినట్టు చెప్పారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను హత్య చేసిందని వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.