యాప్నగరం

యాదాద్రి జిల్లాలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపి కిరోసిన్ పోసి దహనం

భాగ్యలక్ష్మి తన ప్రియుడికి ఫోన్లో సమాచారం ఇవ్వడంతతో తన ప్రియుడు ఐలయ్యకు ఫోన్‌ చేసి చెప్పడంతో అతడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. నిద్రమత్తులో ఉన్న నరేశ్‌ ముఖంపై భార్య భాగ్యలక్ష్మి దిండు అదిమి ఊపిరాడకుండా చేయగా.. చేతులు కాళ్లు కదలకుండా ఐలయ్య పట్టుకున్నాడు

Samayam Telugu 15 Dec 2019, 8:55 am
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో కట్టుకున్న భర్తనే ప్రియుడి సాయంతో కడతేర్చిందో ఇల్లాలు. ప్రియుడితో భర్తను గుల్బర్గాలో సజీవ దహనం చేయించిన ఓ భార్య ఘటన చేధించిన రెండ్రోజులకే యదాద్రి జిల్లాలో అదే తరహాలో ఈ ఘటన వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. అత్తగారింటికి వెళ్లి ఆరుబయట నిద్రించిన అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి హత్య, తల్లి అరెస్టుతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు.
Samayam Telugu dead body


Also Read: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. అట్టుడుకుతున్న గుంటూరు

యాదాద్రి జిల్లా రాజంపేట మండలం దూదివెంకటాపురానికి చెందిన ఎర్రోళ్ల భాగ్యలక్ష్మి, మోటకొండూరు మండల కేంద్రానికి చెందిన కొల్లూరు నరేశ్‌కు 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఓ కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భాగ్యలక్ష్మికి మోటకొండూరుకు చెందిన వంగపల్లి ఐలయ్యతో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న నరేష్ భార్యతో గొడవపడటంతో నాలుగేళ్ల క్రితం వెళ్లిపోయింది. అయితే అప్పుడప్పడు పిల్లలను చూసేందుకు అత్తింటికి వెళ్లే నరేశ్ భార్యను వేధింపులకు గురిచేస్తుండటం, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండటంతో అతడిని చంపేయాలని భాగ్యలక్ష్మి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.

Also Read: అత్తపై అత్యాచారం.. భార్యకు విడాకులిస్తానని పరార్!

ఈ నెల 9న పిల్లలను చూసేందుకు అత్తారింటికి వచ్చిన నరేశ్‌ మద్యం మత్తులో భార్యతో మరోసారి గొడవపడ్డాడు. అనంతరం రాత్రి ఇంటిముందే మంచంపై పడుకున్నాడు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మి తన ప్రియుడికి ఫోన్లో సమాచారం ఇవ్వడంతతో తన ప్రియుడు ఐలయ్యకు ఫోన్‌ చేసి చెప్పడంతో అతడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. నిద్రమత్తులో ఉన్న నరేశ్‌ ముఖంపై భార్య భాగ్యలక్ష్మి దిండు అదిమి ఊపిరాడకుండా చేయగా.. చేతులు కాళ్లు కదలకుండా ఐలయ్య పట్టుకున్నాడు. నరేశ్‌ చనిపోయిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శరీరంపై కిరోసిన్ పోసి నిప్పటించారు.

Also Read: దారితప్పిన యువతి.. సాయం పేరుతో లాడ్జికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్

అయితే ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ నరేశ్ తల్లి కొల్లూరి ఎల్లమ్మ ఫిర్యాదు రాజాపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు భాగ్యలక్ష్మి, ఐలయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఇంటర్ బాలికపై అత్యాచారం.. మామ, అల్లుడిపై పోక్సో కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.