యాప్నగరం

ప్రియుడితో కుమ్మక్కై భర్తను చంపేసిన భార్య.. శవం కనపడకుండా షాకింగ్ ప్లాన్

Tandoor: నాగరాజు మొదటి భార్య లక్ష్మీకి అదే గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌తో అక్రమ సంబంధం ఉందని తెలియడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణ జరపడంతో నాగరాజును తామే చంపామనే నిజం బయటపడింది.

Samayam Telugu 22 Aug 2020, 11:20 pm
ఆస్తి తనకు దక్కదేమోననే అనుమానంతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను దారుణంగా చంపేసింది. అంతేకాక, ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు శవాన్ని ఓ సిమెంట్ పోల్‌కి కట్టి చెరువులో పడవేసింది. ఈ అత్యంత దారుణమైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
husband murder


‌తాండూర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం చెంగొల్ గ్రామానికి చెందిన నడిమింటి నాగరాజ్ ఈనెల 12వ తేదీ నుంచి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు 14వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నాగరాజుకు ఇద్దరు భార్యలు ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి ఫోన్ వివరాలను ఆరాతీశారు.

నాగరాజు మొదటి భార్య లక్ష్మీకి అదే గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌తో అక్రమ సంబంధం ఉందని తెలియడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. మొదటి భార్యని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపడంతో నాగరాజును తామే చంపామనే నిజం బయటపడింది. నాగరాజ్ రెండవ భార్యకు ఆస్తిని రాసి ఇస్తున్నాడనే విషయం లక్షీకి తెలిసింది. ఎలాగైనా భర్త నాగరాజును చంపేస్తే ఆస్తి తనకు దక్కుతుందన్న ఉద్దేశంతో అక్రమ సంబంధం పెట్టుకున్న బాలరాజ్‌తో గత మూడు నెలల నుంచి హత్యకు సంబంధించి పథకం రచించారు.

Also Read: undefined

12 తేదీన రాత్రి 10 గంటల సమయంలో నాగరాజ్ ఇంట్లో పడుకొని ఉండగా లక్ష్మి ప్రియుడు బాలరాజు మరో ముగ్గురితో తలా రూ.లక్ష ఇస్తానని చెప్పి లక్ష్మి ఇంటికి తీసుకెళ్లాడు. నిద్రపోతున్న భర్తను లక్ష్మి ఇనుప రాడ్‌తో ఛాతీ, ఎడమ కాలుపై గట్టిగా కొట్టడంతో నాగరాజ్ అరిచాడు. బాలరాజ్ నాగరాజ్ నోరు మూసి, గొంతు నులిమి చంపేశాడు. ఈ అరుపులు వినీ నాగరాజ్ కొడుకు శ్రీనాథ్ తన బెడ్ రూమ్‌లో నుంచి వచ్చి చూశాడు. శ్రీనాథ్ చూస్తున్న విషయం గమనించిన లక్ష్మి శ్రీనాథ్‌ని హాల్‌లోకి తీసుకెళ్లి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పింది.

Also Read: undefined

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చనిపోయిన నాగరాజు మృతదేహాన్ని బాలరాజ్ మరో వ్యక్తి ఆటో సహాయంతో సిమెంట్ పోల్‌కి తాడుతో కట్టి గొల్ల చెరువులో పడేశారు. నిందితులు ఈ విషయం బయటపెట్టడంతో 21 తేదీన చెరువులో గాలించి శవాన్ని బయటకు తీశారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.